తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్​లో క్రయవిక్రయాలు ప్రారంభం - ఎనుమాముల వ్యవసాయ మార్కెట్​లో క్రయవిక్రయాలు ప్రారంభం

వరంగల్ అర్బన్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్​లో దాదాపు నెల రోజుల సెలవుల తర్వాత బుధవారం క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి. కొవిడ్ వైరస్ తీవ్రత దృష్ట్యా రైతులందరూ మాస్కులు ధరించి మార్కెట్​లోనికి వస్తున్నారు.

trading started in warangal enumamula market
ఎనుమాముల వ్యవసాయ మార్కెట్​లో క్రయవిక్రయాలు ప్రారంభం

By

Published : Aug 12, 2020, 12:01 PM IST

నెల రోజుల సెలవుల తర్వాత వరంగల్​ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్​లో క్రయవిక్రయాలు జోరుగా మొదలయ్యాయి. కరోనా వైరస్​ విస్తరిస్తున్న నేపథ్యంలో అధికారులు మార్కెట్​కు సెలవులు ప్రకటించారు. బుధవారం మార్కెట్ యార్డులో క్రయవిక్రయాలను తిరిగి ప్రారంభించారు.

కొవిడ్ వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న వేళ రైతులు మాస్కులు ధరించి లోనికి వస్తున్నారు. మాస్కులు లేకుండా వచ్చిన వారిని మార్కెట్​లోకి అనుమతించట్లేదు. ప్రతి రైతు భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టినప్పటికీ అవి అమలు అవ్వట్లేదంటూ కొందరు ఆరోపిస్తున్నారు. మార్కెట్ ప్రధాన గేటు వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేసే సిబ్బంది కనిపించకపోవడం పలు విమర్శలకు దారి తీస్తోంది.

ఇదీ చదవండి:'కోజికోడ్​ విమానాశ్రయ రన్​వే సురక్షితమైనదే'

ABOUT THE AUTHOR

...view details