తెలంగాణ

telangana

కళాక్షేత్రం నిర్మాణ పనులు వేగవంతం చేయండి: పురపాలక కమిషనర్

By

Published : Nov 24, 2020, 2:15 PM IST

కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులు వేగవంతం చేయాలని​ పురపాలక కమిషనర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. వరంగల్​ అర్బన్ జిల్లా హనుమకొండలో కొనసాగుతున్న పనులను ఆమె పరిశీలించారు.

To speed up bhilding works in kaloji kalkshetram in hanmakonda
కళాక్షేత్రం నిర్మాణ పనులు వేగవంతం చేయండి: పురపాలక కమిషనర్

వరంగల్ అర్బన్​ జిల్లా హనుమకొండలో నిర్మాణం చేపడుతున్న కాళోజీ కళాక్షేత్రం పనులను మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి తనిఖీ చేశారు. పనుల పురోగతిని పరిశీలించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

నాణ్యతలో రాజీ పడకుండా భవన నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కళాక్షేత్రంతో పాటు పబ్లిక్ గార్డెన్​లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు.

ఇదీ చూడండి:గ్రేటర్​లో గెలుపు మాదే.. రెండో స్థానం ఎంఐఎందే: కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details