తెలంగాణ

telangana

By

Published : Aug 18, 2020, 8:25 AM IST

ETV Bharat / state

అధికారుల నిర్లక్ష్యం వల్లే ఓరుగల్లుకు ఆ దుస్థితి: బండి సంజయ్

వరంగల్ నగరంలో ముంపునకు గురైన ప్రాంతాలను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరిశీలించారు. అనంతరం కాకతీయ వైద్య కళాశాల ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని సందర్శించారు. అక్కడి అభివృద్ధి పనులను గమనించారు.

అధికారుల నిర్లక్ష్యం వల్లే ఓరుగల్లుకు ఆ దుస్థితి : బండి సంజయ్
అధికారుల నిర్లక్ష్యం వల్లే ఓరుగల్లుకు ఆ దుస్థితి : బండి సంజయ్

వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యంతో భారీ నష్టం సంభవించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నగరంలోని ప్రధాన నాళాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోకపోవడం కారణంగానే ఇంత పెద్ద నష్టం జరిగిందన్నారు. వరంగల్ నగరంలో ముంపునకు గురైన అమరావతినగర్ దీన్​దయాల్​ నగర్ రంగంపేట శివనగర్ ప్రాంతాలను ఆయన పరిశీలించారు. అనంతరం కాకతీయ వైద్య కళాశాల ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో జరుగుతున్న అభివృద్ధి పనులను గమనించారు.

అలా చేస్తే సహించం...

నూతన ఆస్పత్రిని కొవిడ్ చికిత్సాకేంద్రంగా మార్చితే సహించేది లేదని తేల్చి చెప్పారు. కొవిడ్ ఆస్పత్రిగా మార్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎమ్మెల్యేల ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కేంద్రం... సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి గాను రూ.120 కోట్ల నిధులను మంజూరు చేస్తే రూ.30 కోట్లు మంజూరు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.

ఇవీ చూడండి : 'పోతిరెడ్డుపాడుపై అప్పుడే ఎందుకు ప్రశ్నించలేదు'

ABOUT THE AUTHOR

...view details