తెలంగాణ

telangana

ETV Bharat / state

వేయి స్థంభాల ఆలయంలో వైభవంగా శివపార్వతుల కల్యాణం - Warangal Urban District Latest News

హన్మకొండలోని వేయి స్థంభాల ఆలయంలో శివపార్వతుల కల్యాణం వైభవంగా జరిగింది. మహా శివరాత్రి సందర్భంగా నిర్వహించిన కల్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తకోటికి స్వామి వారి తలంబ్రాలు, శేష వస్త్రాలను అందజేశారు.

The marriage of Shiva and Parvati took place at the Thousand Pillars Temple
వైభవంగా వేయి స్థంభాల శివపార్వతుల కల్యాణం

By

Published : Mar 12, 2021, 12:35 AM IST

వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలోని సుప్రసిద్ధ వేయి స్థంభాల ఆలయంలో శివపార్వతుల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా దేవస్థాన ఆవరణలో నిర్వహించిన ఈ కల్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి పరవశించి పోయారు.

శివ పార్వతుల కల్యాణం వైభవంగా జరిగింది. భక్తులకు స్వామి వారి కల్యాణ తలంబ్రాలు, శేష వస్త్రాలు ఆలయ అర్చకులు అందజేశారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు.. పోటెత్తిన భక్తులు

ABOUT THE AUTHOR

...view details