తెలంగాణ

telangana

ETV Bharat / state

'నేను తప్పు చేశానని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా' - దాస్యం వినయ్​భాస్కర్

రాజకీయంగా తన ఎదుగుదల సహించలేని కొందరు పనిగట్టుకుని తనపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్​ విప్​ దాస్యం వినయ్​భాస్కర్​ ఆవేదన వ్యక్తం చేశారు.

'నేను తప్పు చేశానని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా'

By

Published : Sep 13, 2019, 6:19 PM IST

'నేను తప్పు చేశానని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా'

దాస్యం కుటుంబ సభ్యులెవరూ అవినీతి అక్రమాలకు పాల్పడలేదని ప్రభుత్వ చీఫ్​ విప్​ అన్నారు. తన ఎదుగుదల సహించలేని కొందరు సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేయడం బాధ కలిగిస్తోందని ఆవేదన చెందారు. తాను తప్పు చేశానని ఎవరైనా ఆధారాలతో నిరూపిస్తే హన్మకొండ ప్రెస్​క్లబ్​లో ముక్కు నేలకు రాయడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్​ చేశారు. తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఇక ముందు తనకెవరూ పుష్పగుచ్చాలు తీసుకురావద్దని, శాలువాలు కప్పొద్దని....ఆ డబ్బులతో పుస్తకాలు తీసుకువస్తే...పేద విద్యార్ధులకు అందించవచ్చని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details