తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎంజీఎం ఆసుపత్రి వద్ద బారులు తీరిన విద్యార్థులు - Students lined up at the MGM Hospital

రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. పాఠశాల యాజమాన్యాలు కొవిడ్​ ధ్రువీకరణ పత్రం సమర్పించాలన్న నిబంధనల కారణంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఎంజీఎం ఆసుపత్రి వద్దకు చేరారు.

ఎంజీఎం ఆసుపత్రి వద్ద బారులు తీరిన విద్యార్థులు
ఎంజీఎం ఆసుపత్రి వద్ద బారులు తీరిన విద్యార్థులు

By

Published : Feb 1, 2021, 3:13 PM IST

వరంగల్​ ఎంజీఎం కొవిడ్​ ఆసుపత్రి వద్ద విద్యార్థులు బారులు తీరారు. పాఠశాలలు పునఃప్రారంభం కావడం వల్ల విద్యార్థులు ఉదయం నుంచి కరోనా పరీక్షా కేంద్రం వద్దకు చేరుకున్నారు.

పాఠశాల యాజమాన్యాలు కొవిడ్​ ధ్రువీకరణ పత్రం సమర్పించాలన్న నిబంధనల కారణంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆసుపత్రి వద్దకు చేరారు. విద్యార్థుల తాకిడిని తట్టుకోలేక కాసేపు ఆసుపత్రి సిబ్బంది.. నమూనాలను సేకరించడం నిలిపివేయడంతో ఆందోళనకు గురయ్యారు. ఆసుపత్రి కార్య నిర్వహణ అధికారి నాగార్జున రెడ్డి ఆదేశాల మేరకు సిబ్బంది విద్యార్థుల కొవిడ్ నమూనాలను సేకరించడంతో తిరిగి యథావిధిగా సేకరణ పుంజుకుంది.

ABOUT THE AUTHOR

...view details