తెలంగాణ

telangana

ETV Bharat / state

నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిపివేత

రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు తెలంగాణ కాటన్ అసోసియేషన్ స్పష్టం చేసింది. వరంగల్​ ఎనుమాముల మార్కెట్​తో పాటు జిల్లాలోని టీఎంసీ పరిశ్రమల వద్ద పత్తి క్రయవిక్రయాలు నిలిపేస్తున్నట్లు కాటన్​ కార్పొరేషన్​ అసోసియేషన్​ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్​ తెలిపారు.

By

Published : Nov 18, 2019, 12:32 AM IST

ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిపివేత

రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ కాటన్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఇండస్ట్రియల్ ప్రమోషన్ పాలసీ సవరణ, సబ్సిడీ తదితర డిమాండ్ల పరిష్కారం కోసం పత్తి కొనుగోళ్లను నిలిపివేయాలని నిర్ణయించినట్లు వ్యాపారులు తెలిపారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్​తో పాటు జిల్లాలోని టీఎంసీ పరిశ్రమల వద్ద పత్తి క్రయ విక్రయాలు జరగకూడదని పిలుపునిచ్చారు. రైతులు సహకరించాల్సిందిగా కోరారు.

తమ సమస్యను చాలాసార్లు ప్రభుత్వం, పాలకుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేదని... అందుకే కొనుగోళ్లు నిలిపేస్తున్నట్లు కాటన్ కార్పొరేషన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ తెలిపారు.

ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిపివేత

ఇదీ చూడండి: సిద్దిపేట రైతు బజారులో మంత్రుల సందడి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details