ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. నేడు అమ్మవారిని 27 కిలోల కూరగాయలతో అందంగా అలంకరించారు.
ప్రతిఏటా ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు అమ్మవారిని వివిధ రకాల కాయగూరలు, పండ్లతో అందంగా అలంకరిస్తారు. కరోనా నేపథ్యంలో ఈసారి ఉత్సవాల నిర్వహణలో మార్పులు చేశారు. గతంలో ఆలయ పరిసరాలనూ కూరగాయలతో అలంకరించే అర్చకులు.. ప్రస్తుతం కేవలం 27 కిలోల కూరగాయలు, పండ్లతో అమ్మవారిని ముస్తాబు చేశారు. శాకంబరీగా కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.