తెలంగాణ

telangana

By

Published : Jan 24, 2021, 11:42 AM IST

ETV Bharat / state

ఆరోగ్యవంతమైన సమాజంతోనే దేశాభివృద్ధి: ఎమ్మెల్యే

స్వచ్ఛ సర్వేక్షన్​లో భాగంగా వరంగల్​లోని శివనగర్​లో 2కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ప్రారంభించారు. ఆరోగ్యం బాగుంటేనే ఆలోచనలు బాగుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.

run for swachh warangal 2k run program inaugurated by warangal east mla nannapaneni narender at shiva nagar in warangal
'ఆరోగ్యవంతమైన సమాజంతోనే దేశం బాగుంటుంది'

ఆరోగ్యం బాగుంటేనే ఆలోచన శక్తి మెరుగుపడుతుందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్​లో భాగంగా శివనగర్​లో ఏర్పాటు చేసిన రన్​ ఫర్ స్వచ్ఛ వరంగల్ 2కే రన్​ను జెండా ఊపి ఆయన ప్రారంభించారు.

తూర్పు నియోజకవర్గంలోని యువతను క్రీడారంగంలో ముందుకు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఆరోగ్యవంతమైన సమాజంతోనే దేశం బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అనంతరం యువకులతో కలిసి 2కే రన్​లో ఆయన పాల్గొన్నారు.

ఇదీ చదవండి:నిజాంసాగర్‌కు కొండపోచమ్మ నుంచి కాళేశ్వరం నీరు!

ABOUT THE AUTHOR

...view details