ఆరోగ్యం బాగుంటేనే ఆలోచన శక్తి మెరుగుపడుతుందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా శివనగర్లో ఏర్పాటు చేసిన రన్ ఫర్ స్వచ్ఛ వరంగల్ 2కే రన్ను జెండా ఊపి ఆయన ప్రారంభించారు.
ఆరోగ్యవంతమైన సమాజంతోనే దేశాభివృద్ధి: ఎమ్మెల్యే
స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా వరంగల్లోని శివనగర్లో 2కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ప్రారంభించారు. ఆరోగ్యం బాగుంటేనే ఆలోచనలు బాగుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.
'ఆరోగ్యవంతమైన సమాజంతోనే దేశం బాగుంటుంది'
తూర్పు నియోజకవర్గంలోని యువతను క్రీడారంగంలో ముందుకు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఆరోగ్యవంతమైన సమాజంతోనే దేశం బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అనంతరం యువకులతో కలిసి 2కే రన్లో ఆయన పాల్గొన్నారు.