తెలంగాణ

telangana

ఏకశిలా పార్కు వద్ద ఆర్టీసీ కార్మికుల రిలే దీక్షలు

By

Published : Nov 17, 2019, 2:36 PM IST

వరంగల్ అర్బన్​ జిల్లాలోని ఏకశిలా పార్కు వద్ద ఆర్టీసీ కార్మికులు రిలే దీక్షలు చేపట్టారు.

ఏకశిలా పార్కు వద్ద ఆర్టీసీ కార్మికుల రిలే దీక్షలు

ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ఏకశిలా పార్కు వద్ద కార్మికులు దీక్షలు చేపట్టారు. 44 రోజులుగా విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నా... ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని కార్మికులు ఆరోపించారు. హైకోర్టు సూచనలను కూడా పట్టించుకోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులపై మొండిగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కార్మికులతో చర్చలు జరిపి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.

ఏకశిలా పార్కు వద్ద ఆర్టీసీ కార్మికుల రిలే దీక్షలు

TAGGED:

rtc dikshalu

ABOUT THE AUTHOR

...view details