గ్రానైట్ లారీ, ఆటో ఢీకొని ముగ్గురు మృతి
వరంగల్ అర్బన్ జిల్లా హాసన్పర్తిలో రోడ్డు ప్రమాదం
11:26 February 11
వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తిలో రోడ్డు ప్రమాదం
వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హసన్పర్తి మూలమలుపు వద్ద గ్రానైట్ లారీ, ఆటో ఢీకొని ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మృతదేహలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి.
అతి వేగంగా గ్రానైట్ లారీ వచ్చి ఆటోను ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. మరో ఇద్దరు గాయపడగా వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
Last Updated : Feb 11, 2020, 3:39 PM IST