తెలంగాణ

telangana

రోడ్లపైకి వస్తే కఠిన చర్యలే...

By

Published : May 4, 2020, 4:51 PM IST

వరంగల్​ పట్టణం రెడ్​జోన్​లో ఉన్నందున పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారికి జరిమానాలు విధిస్తున్నారు.

Quiet ongoing lock down in Warangal
రోడ్లపైకి వస్తే కఠిన చర్యలే...

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలో లాక్​డౌన్ అమలు ప్రశాంతంగా కొనసాగుతుంది. అనవసరంగా బయటకు వచ్చిన వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. వాహనాలను సీజ్ చేస్తూ... జరిమానాలు విధిస్తున్నారు. వరంగల్ నగరం రెడ్​జోన్​లో ఉన్నందున పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. ప్రతి చోట బారికేడ్లు పెట్టి నగర వాసులు రోడ్ల పైకి రాకుండా కట్టడి చేస్తున్నారు. కిరణ షాపులు, మెడికల్ షాపులు తప్పా అన్నింటిని బంద్ చేయించారు.

ABOUT THE AUTHOR

...view details