తెలంగాణ

telangana

ETV Bharat / state

షీటీమ్​లపై ప్రజలకు నమ్మకం పెరిగింది: సీపీ ప్రమోద్‌కుమార్‌ - Telangana news

షీ టీమ్​లకు మంజూరు చేసిన నూతన ద్విచక్ర వాహనాలను వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. షీ టీమ్‌లపై ప్రజలకు నమ్మకం పెరిగిందని సీపీ పేర్కొన్నారు.

షీటీమ్​లపై ప్రజలకు నమ్మకం పెరిగింది: సీపీ ప్రమోద్‌కుమార్‌
షీటీమ్​లపై ప్రజలకు నమ్మకం పెరిగింది: సీపీ ప్రమోద్‌కుమార్‌

By

Published : Feb 10, 2021, 4:17 PM IST

రాష్ట్రంలో షీ టీమ్‌ల బలోపేతానికి మంజూరు చేసిన ద్విచక్రవాహనాలను వరంగల్‌లో సీపీ ప్రమోద్‌కుమార్‌ జెండా ఊపి ప్రారంభించారు. మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం ఏర్పాటు చేసిన షీ టీమ్‌లపై ప్రజలకు నమ్మకం పెరిగిందని సీపీ పేర్కొన్నారు.

నూతన ద్విచక్ర వాహనాలతో సిబ్బంది

గత రెండేళ్లలో కమిషనరేట్ పరిధిలో మహిళలను వేధిస్తున్న 43 మందిపై ఎఫ్​ఐఆర్​లు నమోదు చేసినట్లు తెలిపారు. 290 కేసులు నమోదు చేయగా, 280 మందిని వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించినట్లు వెల్లడించారు. నూతన వాహనాలను సిబ్బంది వ్యక్తిగత శ్రద్ధతో పరిరక్షించుకోవాలని సీపీ ప్రమోద్ కుమార్ సూచించారు.

ఇదీ చదవండి:కిడ్నీ వ్యాధిగ్రస్థులకు పింఛన్​ ఇవ్వాలని కేసీఆర్​కు విజ్ఞప్తి

ABOUT THE AUTHOR

...view details