తెలంగాణ

telangana

ETV Bharat / state

పిడుగు పడి గొర్రెలు,  కాపరి దుర్మరణం

పిడుగుపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన వరంగల్​ పట్టణ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపురంలో చోటుచేసుకుంది. అదే మండలంలోని ఒంటి మామిడిపల్లిలో పిడుగు పడి 32 గొర్రెలు చనిపోయాయి.

By

Published : Apr 19, 2019, 1:00 PM IST

పిడుగు పడి గొర్రెలు,  కాపరి దుర్మరణం

పిడుగులు పడి మృతి చెందిన గొర్రెలు, కాపరి

వరంగల్‌ పట్టణ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపురంలో పిడుగు పడి గొర్రెల కాపరి ఫకీర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లిలో పిడుగు పడి 32 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల మంద సమీపంలో పిడుగు పడడంతో ప్రమాదం జరిగింది. రాత్రి వేళలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అకాల వర్షంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

ABOUT THE AUTHOR

...view details