తెలంగాణ

telangana

లాక్​డౌన్ ఎఫెక్ట్​.. ఉదయాన్నే నిత్యావసరాల కోసం నగరవాసులు

నేటి నుంచి లాక్​ డౌన్​ అమలు కానున్నందున... ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అన్నిరకాల కార్యకలాపాలు కొనసాగుతాయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వరంగల్​ నగరంలో దుకాణాలు ఉదయాన్నే తెరవడంతో... ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేశారు.

By

Published : May 12, 2021, 10:50 AM IST

Published : May 12, 2021, 10:50 AM IST

People buying essentials at shops in the morning
నగరంలో ఉదయాన్నే తెరిచిన దుకాణాలు

లాక్​ డౌన్​ నేపథ్యంలో నిత్యావసరాలు సమకూర్చుకునేందుకు వరంగల్​ నగరవాసులు దుకాణాల వద్ద కొనుగోలు చేశారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అన్ని రకాల కార్యకలాపాలకు రాష్ట్రప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో హన్మకొండలోని వస్త్ర దుకాణాల నుంచి మద్యం దుకాణాల వరకు అన్నింటినీ ఉదయాన్నే తెరిచారు.

నగరంలో ఉదయాన్నే తెరిచిన దుకాణాలు

దీంతో నగరవాసులు ఉదయాన్నే షాపుల వద్దకు వచ్చి తమకు కావాల్సిన నిత్యావసర సరుకులను కొనుగోలు చేసి వెళ్లారు. ఆర్టీసీ బస్సులు బంద్​ నేపథ్యంలో హన్మకొండ బస్టాండ్ బోసిపోయింది. ఉదయం 10 గంటల తరువాత నగరంలో లాక్​డౌన్​ను కఠినంగా అమలు చేస్తున్నారు.

ఇదీ చదవండి: టీకా తొలి డోసు తీసుకున్నాక కరోనా వస్తే?

ABOUT THE AUTHOR

...view details