తెలంగాణ

telangana

By

Published : Feb 26, 2020, 7:52 PM IST

ETV Bharat / state

'ప్రగతిబాటలో నడిచే డివిజన్లకు ప్రతినెల నగదు ప్రోత్సాహకం'

పట్టణాలను పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణ ప్రగతి శ్రీకారం చుట్టారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. వరంగల్ నగరంలోని 13 డివిజన్​లో ఆయన పర్యటించారు. రహదారులకు అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలు తొలగింపునకు ఆయన శ్రీకారం చుట్టారు.

pattanapragathi program in warangal
వరంగల్​లో పట్టణ ప్రగతి కార్యక్రమం

పట్టణాలను పరిశుభ్రంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే సన్నపనేని నరేందర్​ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వరంగల్​ నగరంలోని 13 డివిజన్లో పర్యటించారు.

ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణ ప్రగతి విజయవంతమవుతుందని ఆయన తేల్చి చెప్పారు. ప్రగతి బాటలో నడుస్తున్న డివిజన్లకు ప్రతి నెల లక్షా ఇరవై వేల రూపాయలు ప్రోత్సాహకంగా అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

వరంగల్​లో పట్టణ ప్రగతి కార్యక్రమం

ఇదీ చూడండి:'పారిశుద్ధ్య స్థితిగతులపై ఎప్పటికప్పుడు నివేదిక'

ABOUT THE AUTHOR

...view details