తెలంగాణ

telangana

బడి నుంచి బయటికి వెళ్లి తిరిగిరాలేదు..

అనాధాశ్రమంలో ఉండే 13 ఏళ్ల విద్యార్థి తప్పిపోయాడు. పాఠశాల నుంచి బయటికి వెళ్లిన కుర్రాడు తిరిగిరాలేదు. పోలీసులు బాలుడి కోసం గాలిస్తున్నారు.

By

Published : Nov 23, 2019, 11:01 AM IST

Published : Nov 23, 2019, 11:01 AM IST

బడి నుంచి బయటికి వెళ్లి తిరిగిరాలేదు..

బడి నుంచి బయటికి వెళ్లి తిరిగిరాలేదు..

వరంగల్​ అర్బన్​ జిల్లా ధర్మసాగర్​ మండలం కరుణాపురంలోని అనాధాశ్రమంలో కొప్పర్ల మంజుసాయినాథ్ ​రెడ్డి అనే బాలుడు ఆశ్రయం పొందుతున్నాడు. కాజీపేట ఫాతిమానగర్​లోని ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు.

మరో 9 మంది ఆశ్రమ విద్యార్థులతో కలిసి రోజూ పాఠశాలకు వెళ్లేవాడు. ఈనెల 21న తరగతులు జరుగుతున్న సమయంలో బహిర్భూమికని వెళ్లిన బాలుడు తిరిగి రాలేదు.

పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆశ్రమ నిర్వాహకులకు సమాచారం అందించగా.. వారు కాజీపేట్​ పీఎస్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి కోసం గాలిస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

Boy missing

ABOUT THE AUTHOR

...view details