తెలంగాణ

telangana

By

Published : Nov 19, 2019, 7:22 PM IST

ETV Bharat / state

సిగరెట్ల రూపంలో గంజాయి సేవించిన నిట్​ విద్యార్థులు

వరంగల్ అర్బన్ జిల్లాలోని జాతీయ సాంకేతిక సంస్థ నిట్​లో 12 మంది విద్యార్థులు వసతిగృహంలో గంజాయి కలిపిన సిగరెట్లను తాగి దొరికిపోయారు.

సిగరెట్ల రూపంలో గంజాయి సేవించిన నిట్​ విద్యార్థులు

వరంగల్​లోని జాతీయ సాంకేతిక విద్యా సంస్థ-నిట్​లో విద్యార్థులు గంజాయి తాగి పట్టుబడిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. దీపావళి పండగ సమయంలో 12 మంది విద్యార్థులు వసతిగృహంలోని.. వారి గదిలో గంజాయి కలిపిన సిగరెట్లను తాగినట్లు సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. ఈ విషయంపై విద్యాసంస్థ అధికారులు నిర్ధారణ కమిటీ వేసి.. విద్యార్థులు కొంత మొత్తంలో గంజాయి సేవించినట్లు ధ్రువీకరించారు. అసలు విద్యాసంస్థ ప్రాంగణంలోకి మత్తు పదార్థాలు ఎలా వచ్చాయనే విషయంపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలియపరిచామన్నారు. విద్యాసంస్థ సంచాలకుడు ప్రస్తుతం విదేశాలలో ఉన్నందున ఆయన వచ్చిన తర్వాత విద్యార్థులపై తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని వారు తెలిపారు.

సిగరెట్ల రూపంలో గంజాయి సేవించిన నిట్​ విద్యార్థులు

ABOUT THE AUTHOR

...view details