తెలంగాణ

telangana

ETV Bharat / state

నిరాడంబరంగా గణనాథుని నిమజ్జనం - హన్మకొండలో గణేశ్​ నిమజ్జనం వార్తలు

హన్మకొండలో నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రతిఏటా ఎంతో ఘనంగా జరిగే నిమజ్జనోత్సవాలు.. కొవిడ్​ కారణంగా ఈసారి నిరాడంబరంగా నిర్వహించారు.

Navratri festivities ending peacefully at Hanmakonda
హన్మకొండలో ప్రశాంతంగా ముగిసిన నవరాత్రి ఉత్సవాలు

By

Published : Aug 31, 2020, 12:21 PM IST

హన్మకొండలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. కరోనా దృష్ట్యా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా నగర వాసులు శోభాయాత్రను నిర్వహించారు.

జిల్లాలో కొవిడ్​ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ఈసారి ఇళ్లలోనే వినాయకులను ప్రతిష్టించుకున్నారు. ఈ మేరకు హన్మకొండలోని పద్మాక్షి గుండం, సిద్ధేశ్వర గుండాలలో నిమజ్జనం చేశారు. గణనాథులను కడసారి చూసేందుకు జనం ఆసక్తి కనబరిచారు.

మరోవైపు నిమజ్జనం సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

పద్మాక్షి గుండంలో గణేశ్​ నిమజ్జనం

ఇదీచూడండి.. వినాయక నిమజ్జనాలతో సందడిగా మారిన ట్యాంక్​బండ్

ABOUT THE AUTHOR

...view details