వరంగల్ జిల్లా వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. బట్టల బజార్లోని శ్రీ కాళీ సేన సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన నవరాత్రి వేడుకల్లో అమ్మవారికి సప్త హారతులను సమర్పించారు. ఉగ్రరూపంలో కొలువుదీరిన అమ్మవారిని చూసేందుకు భక్తులు బారులు తీరారు.
వరంగల్లో వైభవోపేతంగా శరన్నవరాత్రులు... - తెలంగాణలో నవరాత్రి వేడుకలు
వరంగల్లో దేవీ నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. రోజూ ప్రత్యేక అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. వరంగల్ బట్టల బజార్లోని శ్రీ కాళీ సేన సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో అమ్మవారు ఉగ్రరూపంలో దర్శనమిచ్చారు. దేవీకి సప్త హారతులు సమర్పించారు.
![వరంగల్లో వైభవోపేతంగా శరన్నవరాత్రులు... Navaratri celebrations in Warangal district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9242492-748-9242492-1603178502439.jpg)
వరంగల్లో వైభవోపేతంగా శరన్నవరాత్రులు... ఉగ్రరూపంలో అమ్మవారు
సప్త హారతులు చూసేందుకు నగరవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకొని... మొక్కులు చెల్లించుకున్నారు.
ఇదీ చదవండి:మహా గౌరీదేవి అలంకరణలో వర్గల్ విద్యా సరస్వతీ అమ్మవారు...