తెలంగాణ

telangana

కన్నుల పండువగా భద్రకాళి అమ్మవారికి తెప్పోత్సవం

By

Published : Oct 25, 2020, 10:38 PM IST

భద్రకాళి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో చివరి రోజైన ఆదివారం.. అమ్మవారు నిజరూప దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా భద్రకాళి తటాకంలో అమ్మవారికి నిర్వహించిన తెప్పోత్సవం కన్నుల పండువగా సాగింది.

Navaratri celebrations at Bhadrakali Temple
భద్రకాళి అమ్మవారికి కన్నుల పండువగా తెప్పోత్సవం

ఓరుగల్లు వాసుల ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి నిజరూప దర్శనం ఇచ్చారు. చివరి రోజైన ఆదివారం అమ్మవారికి హంస వాహనంపై జలక్రీడ నిర్వహించారు.

ఈ సందర్భంగా భద్రకాళి తటాకంలో నిర్వహించిన తెప్పోత్సవం కన్నుల పండువగా సాగింది. ఈ తెప్పోత్సవంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏటా అత్యంత వైభవోపేతంగా జరిగే ఉత్సవాలు.. కరోనా నేపథ్యంలో ఈ సంవత్సరం సాదాసీదాగా నిర్వహించారు.

ఇదీ చూడండి.. రేపటి నుంచి శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీ

ABOUT THE AUTHOR

...view details