వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారంలోని కస్తూర్భా గాంధీ కళాశాలకు చెందిన విద్యార్థునులకు రాత్రి భోజనం వికటించింది. 30 మంది అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు విరోచనాలు కావడం వల్ల వారిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అమ్మాయిలకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
భోజనం వికటించి 30 మంది విద్యార్థినులకు అస్వస్థత - కస్తూర్భా గాంధీ కళాశాల విద్యార్థునలకు అస్వస్థత
భోజనం వికటించి విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన వరంగల్లో చోటుచేసుకుంది. 30 మందికి విరోచనాలు కాగా.. వారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

భోజనం వికటించి 30 మంది విద్యార్థినులకు అస్వస్థత
భోజనం వికటించి 30 మంది విద్యార్థినులకు అస్వస్థత
వసతి గృహంలో రాత్రి భోజన సమయంలో ఆలుగడ్డ, పచ్చిపులుసు తిన్నామని.. రాత్రి నుంచి అందరికి విరోచనాలు అవుతున్నాయని విద్యార్థినులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి :మాటలతో మాయ చేసి.. మంత్రి పేరుతో ముంచేస్తాడు..!