తెలంగాణ

telangana

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి: ఎంపీ దయాకర్

By

Published : Apr 30, 2021, 4:03 PM IST

వరంగల్​ నగరపాలక ఎన్నికల పోలింగ్​ నత్తనడకలా సాగుతోంది. ఎంపీ పసునూరి దయాకర్​ 17వ డివిజన్​లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

వరంగల్​లో ఓటేసిన ఎంపీ పసునూరి దయాకర్​

గ్రేటర్​ వరంగల్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 17వ డివిజన్ బొల్లికుంటలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మందుకొడిగా సాగుతున్న ఓటింగ్ సరళిపై దయాకర్ విచారం వ్యక్తం చేశారు. ఎలాంటి పనులున్నా సాయంత్రం లోపు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:ఎన్నికలు పెట్టి ప్రజలను ఆశ్చర్యపరచవద్దు: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details