తెలంగాణ

telangana

ETV Bharat / state

హన్మకొండలో ఊపందుకున్న ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రచారం

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఆయా పార్టీల అభ్యర్థులు తమ తమ హామీలతో పట్టభద్రలను కలుస్తూ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.

By

Published : Nov 3, 2020, 2:48 PM IST

mlc election candidates campaign at hanamkonda in warangal urban district
హన్మకొండలో ఊపందుకున్న ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రచారం

వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల అభ్యర్థుల ప్రచారాలు జోరందుకున్నాయి. పట్టభద్రల సమస్యలు, గెలిచిన అనంతరం తాము చేయనున్న హామీలను చెప్తూ ఆయా పార్టీల అభ్యుర్థులు ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. యువ తెలంగాణ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాణి రుద్రమదేవి, వామపక్ష పార్టీలు బలపర్చిన అభ్యర్థి జయసారథి రెడ్డి ప్రచారపర్వంలో ముందుకుసాగుతున్నారు.

పట్టభద్రులను కలుస్తూ తమ ఎన్నికల ప్రచారాన్ని వేగం పెంచారు. ఉదయం పూట వాకర్స్​ను కలుస్తూ ప్రచారం చేపట్టగా మధ్యాహ్నం సమయంలో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి తమకు ఓటు వేయాలని పట్టభద్రులను అభ్యర్థిస్తున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని కోరారు.

ఇదీ చదవండి:చిట్టాపూర్​లో సుజాత.. బొప్పాపూర్​లో రఘునందన్... తుక్కాపూర్​లో శ్రీనివాస్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details