ట్రాన్స్జెండర్స్కు అండగా ఉండాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. గత కొన్నేళ్లుగా వరంగల్ నగరంలోని ఎస్ఆర్ఆర్ తోటలో నివాసముంటున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంటి పత్రాలు అందజేశారు.
'ట్రాన్స్జెండర్స్కు అండగా నిలుస్తాం.. ఇళ్లు కట్టిస్తాం'
ట్రాన్స్జెండర్స్కు అండగా ఉండాలని ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. అర్హులైన వారికి రెండు పడకల ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. వరంగల్ నగరంలో ట్రాన్స్జెండర్ కమ్యూనిటి భవనానికి భూమి పూజ చేశారు.
ట్రాన్స్ జెండర్ కమ్యూనిటి భవనానికి భూమి పూజ
నగరంలో ట్రాన్స్జెండర్ కమ్యూనిటి భవనానికి ఆయన భూమి పూజ చేశారు. అర్హులైన వాళ్లకు రెండు పడకల ఇళ్లు త్వరలోనే నిర్మిస్తామని హామీ ఇచ్చారు. సకల వసతులతో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. వారిని అన్ని విధాలా ఆదుకునేది తెరాస సర్కారేనని తెలిపారు.
ఇదీ చూడండి:నన్ను హిజ్రాాగా మార్చారు.. ఆత్మహత్య చేసుకుంటున్నా..!