తెలంగాణ

telangana

ETV Bharat / state

పేదింటి ఆడ పడుచులకు అండ కల్యాణ లక్ష్మి: ఎమ్మెల్యే చల్లా - MLA Challa distributing Kalyana Lakshmi checks

సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం తెరాస అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు. పరకాల నియోజకవర్గంలోని సంగెం, గీసుకొండ మండలాల్లోని లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులను పంపిణీ చేశారు.

MLA Challa distributing Kalyana Lakshmi checks
కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే చల్లా

By

Published : Sep 3, 2020, 2:16 PM IST

రాష్ట్ర ప్రభుత్వం సామాజిక స్పృహతో ప్రవేశపెట్టిన పథకం కల్యాణ లక్ష్మి అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు. పేదింటి ఆడపడుచులకు అన్ని విధాలా అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం తెరాస అని కొనియాడారు. వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలోని తన నివాసంలో సంగెం, గీసుగొండ మండలాల్లోని పలువురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులను అందజేశారు.

ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి, నేరుగా లబ్ధిదారులకు అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్​కే దక్కిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎక్కడా అవినీతికి తావివ్వకుండా, పార్టీలకు అతీతంగా పాలన చేసినందుకే.. కేసీఆర్​ రెండోసారీ అధికారంలోకి వచ్చారన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​ పథకాలపై అధికారులు ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో సంగెం, గీసుగొండ మండల తహసీల్దార్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:ఆసిఫాబాద్‌లో రెండోరోజు డీజీపీ మహేందర్​రెడ్డి పర్యటన

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details