తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రజలు ఇంకొన్ని రోజులు ఓపిక పట్టాలి' - Food distribution

వరంగల్ అర్బన్ జిల్లా హసన్​పర్తి మండలం వంగపహాడ్​లో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ సరుకులు పంపిణీ చేశారు. ప్రజలు ఇంకొన్ని రోజులు ఓపికపట్టి ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు.

Mla aruri ramesh distributed groceries to poor
Mla aruri ramesh distributed groceries to poor

By

Published : May 20, 2020, 3:46 PM IST

లాక్ డౌన్ వేళ ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ నిత్యావసర సరుకులను అందజేశారు. వరంగల్ అర్బన్ జిల్లా హసన్​పర్తి మండలం వంగపహాడ్ లో సరుకులు పంపిణీ చేశారు.

ఇంకా కొన్ని రోజులు ప్రజలు ఓపిక పట్టి... ఇళ్ల వద్దనే ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా... ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details