కరోనా బారి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరితగతిన కోలుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆకాంక్షించారు. కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆరోగ్యంగా ఉండాలని వరంగల్ భద్రకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు.
సీఎం కేసీఆర్ కోలుకోవాలని మంత్రి సత్యవతి ప్రత్యేక పూజలు - minister satyavati venerations for cm kcr and ktr health in warangal bhadrakali temple
కరోనా మహమ్మారి నుంచి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ త్వరగా కోలుకోవాలని మంత్రి సత్యవతి రాఠోడ్ ప్రత్యేక పూజలు జరిపించారు. వరంగల్ భద్రకాళి ఆలయంలో అమ్మవారికి పూజలు చేశారు.
![సీఎం కేసీఆర్ కోలుకోవాలని మంత్రి సత్యవతి ప్రత్యేక పూజలు minister satyavati venerations for cm kcr and ktr](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12:37:55:1619766475-11589968-minister.jpg)
మంత్రి సత్యవతి ప్రత్యేక పూజలు
మంత్రితో పాటు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో తెరాస విజయం సాధిస్తుందని మంత్రి సత్యవతి ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:ఎగ్జిట్ పోల్స్: నాగార్జునసాగర్లో తెరాసకు 50.48 శాతం ఓట్లు