తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్​లో నేడు మంత్రి కేటీఆర్ పర్యటన - minister KTR latest news

వరంగల్ ప్రజల దాహార్తిని తీర్చే... ఇంటింటికీ మంచినీటి సరఫరా పథకాన్ని.. మంత్రి కేటీఆర్ ఉగాది కానుకగా ఇవాళ ప్రారంభించనున్నారు. పురపాలక శాఖ మంత్రి ఓరుగల్లు పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. రెండు పడకల గదుల ప్రారంభోత్సవం సహా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొననున్నారు.

minister ktr latest news, minister ktr visit Warangal
వరంగల్లులో నేడు మంత్రి కేటీఆర్ పర్యటన

By

Published : Apr 12, 2021, 4:16 AM IST

Updated : Apr 12, 2021, 6:37 AM IST

వరంగల్లులో నేడు మంత్రి కేటీఆర్ పర్యటన

గ్రేటర్ వరంగల్ ఎన్నికల ముంగిట ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్... వరంగల్లో​ సుడిగాలి పర్యటన చేయనున్నారు. రెండు వేల కోట్ల రూపాయలకుపైగా వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటారు. హైదరాబాద్ నుంచి నేరుగా... కాజీపేట రాంపూర్‌కి చేరుకుని.... వరంగల్ నగర వాసులకు ప్రతి రోజూ స్వచ్ఛమైన నీరందించే మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇందుకోసం మిషన్ భగీరథ కింద 939 కోట్ల రూపాయల వ్యయం కాగా... అమృత్ పథకం కింద 413 కోట్లు ఖర్చు చేశారు.

సమీకృత మార్కెట్లు

అనంతరం వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని దేశాయ్‌పేటలో 10 కోట్ల 60 లక్షల వ్యయంతో నిర్మించే జర్నలిస్ట్ కాలనీకి.. భూమిపూజ చేస్తారు. దూపకుంట వద్ద 600 మంది లబ్ధిదారుల కోసం.. 31 కోట్ల 80 లక్షల వ్యయంతో, ఎస్‌ఆర్‌ నగర్‌లో 13 కోట్ల వ్యయంతో నిర్మించిన రెండు పడకల గదుల ఇళ్ల పంపిణీ చేస్తారు. లక్ష్మీపురంలో 6 కోట్ల 24 లక్షల వ్యయంతో నిర్మించిన పండ్ల మార్కెట్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. ఇక్కడే 24 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సమీకృత మార్కెట్లకు శంకుస్థాపన చేస్తారు. బట్టల బజార్‌లో 66 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన... పై వంతెనను మంత్రి ప్రారంభిస్తారు. శివనగర్ వద్ద 7 కోట్ల 80 లక్షల రూపాయలతో నిర్మించిన.. రైల్వే అండర్ బ్రిడ్జినీ ప్రారంభిస్తారు.

జంక్షన్ల ప్రారంభం

వరంగల్‌లో పలు రహదారులు, వరద కాల్వలలు, వైకుంఠ ధామాలకు శంకుస్థాపనలు చేస్తారు. 35 కోట్ల వ్యయంతో నిర్మించిన భద్రకాళీ బండ్, ఆధ్మాత్మిక ప్రశాంతతను చేకూర్చే అగలయ్య గుట్ట జైన మందిరం.. ఆహ్లాదం పంచేలా తీర్చిదిద్దిన పార్కులు, నగర అందాలను ఇనుమడింప చేసే విధంగా తయారైన జంక్షన్లను మంత్రి ప్రారంభిస్తారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్‌, చీఫ్ విప్ వినయ్ భాస్కర్.. ఇతర నేతలు...కేటీఆర్ రాకను పురస్కరించుకుని ఏర్పాట్లను పరిశీలించారు.

ఎన్నికలపై దిశా నిర్దేశం

ఖిలా వరంగల్ మైదానంలోనూ, శాయంపేట జంక్షన్‌లోనూ జరిగే సభల్లో కేటీఆర్ పాల్గొంటారు. పార్టీ నేతలు, కార్యకర్తలతోనూ సమావేశమై... త్వరలో రానున్న గ్రేటర్ వరంగల్ ఎన్నికలపై దిశా నిర్దేశం చేయనున్నారు. కేటీఆర్ పర్యటన పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచుతుందని నేతలు చెబుతున్నారు. కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికేందుకు గులాబీ దళం సన్నద్ధమైంది. రాత్రి 7 గంటలకు ఒకరోజు పర్యటన ముగించుకుని... కేటీఆర్ హైదరాబాద్ బయల్దేరి వెళతారు.

ఇదీ చూడండి :ఈటీవీ భారత్​ కథనంపై స్పందించిన సీఎం కేసీఆర్‌

Last Updated : Apr 12, 2021, 6:37 AM IST

ABOUT THE AUTHOR

...view details