తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతు వేదికలు.. చైతన్య వేదికలవ్వాలి : మంత్రి ఈటల - మంత్రి ఈటల రాజేందర్‌

పండించిన పంటకు ధర నిర్ణయించుకోవాలంటే రైతులు సంఘటితం కావాలని మంత్రి ఈటల పేర్కొన్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్​లో ఏర్పాటైన రైతు వేదిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Minister Itala said farmers should unite to decide the price of their produce
రైతు వేదికలు.. చైతన్య వేదికలవ్వాలి : మంత్రి ఈటల

By

Published : Feb 4, 2021, 10:18 PM IST

రైతు వేదికలు చైతన్య వేదికలుగా మారాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్​లో ఏర్పాటైన రైతు వేదికను.. జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీతో కలిసి ఆయన ప్రారంభించారు. దేశంలో 70శాతం మంది వ్యవసాయం పైనే ఆధారపడ్డారని మంత్రి పేర్కొన్నారు. ఆ రంగం బాగుంటేనే దేశంమంతా బాగుంటుందన్నారు.

పండించిన పంటకు ధర నిర్ణయించుకోవాలంటే రైతులు సంఘటితం కావాలని మంత్రి పేర్కొన్నారు. తక్కువ పెట్టబడితో పంటలను సాగు చేసుకోవాలన్నారు. రైతులంతా చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌కుమార్‌, రైతుబంధు సమితి జిల్లా సమన్వయకర్త లలితా, డీఆర్‌డీఏ శ్రీనివాస్‌, ఏడిఏ దామోదర్‌రెడ్డి, ఎంపీపీ రాణి, జడ్పీటీసీ కల్యాణి, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ బాలకిషన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:కిలో పాలు రూ.33... ఆ కథేంటి..?

ABOUT THE AUTHOR

...view details