తెలంగాణ

telangana

By

Published : Feb 20, 2020, 12:39 PM IST

ETV Bharat / state

మున్సిపల్​ చట్టంపై అవగాహన పెంచుకోండి: ఎర్రబెల్లి

మున్సిపల్​ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు సూచించారు. హన్మకొండలో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు.​

మున్సిపల్​ చట్టంపై అవగాహన పెంచుకోండి: ఎర్రబెల్లి
మున్సిపల్​ చట్టంపై అవగాహన పెంచుకోండి: ఎర్రబెల్లి

మున్సిపల్​ చట్టంపై అవగాహన పెంచుకోండి: ఎర్రబెల్లి

పట్టణ ప్రగతి పనులు త్వరగా పూర్తి చేయాలని.. లేని పక్షంలో చర్యలు తప్పవని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వరంగల్‌లో హెచ్చరించారు. హన్మకొండలో వరంగల్‌ గ్రామీణ జిల్లా కలెక్టర్‌ హరిత ఆధ్వర్యంలో పంచాయితీరాజ్ సమ్మెళనం, పట్టణ ప్రగతిపై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సదస్సులో అధికారులకు , ప్రజాప్రతినిధులకు పల్లె, పట్టణ ప్రగతిపై ఎర్రబెల్లి దిశానిర్దేశం చేశారు. మున్సిపల్‌ చట్టాన్ని ప్రతీ ఒక్కరూ చదివి అవగాహన తెచ్చుకోవాలని మంత్రి సూచించారు. పల్లె ప్రగతిలో అక్కడఅక్కడ పనులు జరుగలేదని.. వాటిని త్వరగా పూర్తి చేయాలని అదేశించారు. సర్పంచ్​లకు సహకరించని ఫీల్డ్ అసిస్టెంట్​లపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇవీ చూడండి:ట్రంప్​కి గుడికట్టి పూజలు చేస్తున్న వీర భక్తుడు

ABOUT THE AUTHOR

...view details