తెలంగాణ

telangana

మేం ఒక్క పిలుపిస్తే ఉరికిచ్చికొడతారు: ఎర్రబెల్లి

By

Published : Jan 31, 2021, 9:13 PM IST

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తాము ఒక్క పిలుపునిస్తే ప్రజలు కమలదళం నాయకులను ఉరికిచ్చికొడతారని హెచ్చరించారు.

మేం ఒక్క పిలుపిస్తే ఉరికిచ్చికొడతారు: ఎర్రబెల్లి
మేం ఒక్క పిలుపిస్తే ఉరికిచ్చికొడతారు: ఎర్రబెల్లి

వరంగల్​ కార్పొరేషన్ ఎన్నికల్లో లబ్ధికోసమే భాజపా దాడులకు పాల్పడుతోందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. తామొక్క పిలుపునిస్తే ప్రజలు కమలదళం నాయకులను ఉరికిచ్చికొడతారని హెచ్చరించారు. వరంగల్​లో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మీడియా సమావేశం నిర్వహించారు.

తెరాస నాయకులపై భాజపా నేతలు దాడులకు పాల్పడడం ఇది నాల్గోసారని మండిపడ్డారు. తెరాస దళాలు ఊరూరా ఉన్నాయని.. తమ ఓపికను పరీక్షించవద్దన్నారు.

మా ఫ్రెండ్లీ పోలీస్ ఊరుకుంటుంది కావచ్చు. కానీ మా కార్యకర్తలు ఊరుకోరు. ఎమ్మెల్యే చల్లా లెక్కలు చెప్పమని ప్రశ్నించడం తప్పా? అయోధ్య రామాలయ నిర్మాణానికి మేం కూడా విరాళాలు ఇచ్చాం. మీ దాదాగిరి - గుండాయిజం ఇక సాగదు. ఇకమీదట వదలిపెట్టే ప్రసక్తే లేదు. తీవ్రస్థాయిలో మా ప్రతిచర్యలు ఉంటాయి. భాజపా రాష్ట్ర నాయకత్వం ఇలాంటి దాడులపై స్పందించాలి. ఎమ్మెల్యే చల్లా ఇంట్లో పిల్లలు, ఆడవాళ్లు ఉన్నారు. ఏ మాత్రం విజ్ఞత లేకుండా దాడికి పాల్పడ్డారు. దాడి చేసి విధ్వంసం సృష్టించారు.

ABOUT THE AUTHOR

...view details