తెలంగాణ

telangana

దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు సాయం: ఎర్రబెల్లి

By

Published : Apr 14, 2021, 4:35 PM IST

వ‌రంగ‌ల్ పట్టణ జిల్లాలో అర్బన్ జిల్లాలో 685 మంది దివ్యాంగులకు ప‌రిక‌రాలు, ఉపకరణాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అందించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు రూ. 3016 సాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని వెల్లడించారు.

minister dayakar rao
దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు సాయం: ఎర్రబెల్లి

దేశంలో ఎక్కడాలేని విధంగా...... 4 ల‌క్షల 92 వేల 680 మంది దివ్యాంగులకు నెల‌కు 3వేల16 రూపాయ‌ల చొప్పున‌ రాష్ట్ర ప్రభుత్వం....ఆస‌రా పెన్షన్లు అందిస్తోందని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టంచేశారు.

వరంగల్ జిల్లా హన్మకొండలో రాష్ట్ర వికలాంగుల స‌హ‌కార సంస్థ ద్వారా ప‌రిక‌రాలు, ఉప‌క‌ర‌ణాల పంపిణీకి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరయ్యారు. వ‌రంగ‌ల్ పట్టణ జిల్లాలో అర్బన్ జిల్లాలో 685 మంది దివ్యాంగులకు ప‌రిక‌రాలు, ఉపకరణాలు అందించారు. దివ్యాంగులు ఆత్మ ధైర్యంతో ముందుకుసాగాలని ఎర్రబెల్లి సూచించారు.

ఇదీ చూడండి:త్వరలోనే హైదరాబాద్​లో 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం: కేటీఆర్‌

ABOUT THE AUTHOR

...view details