తెలంగాణ

telangana

ETV Bharat / state

కాజీపేటలో మేడే వేడుకలు... కార్మికుల అన్నదానం

వరంగల్​ అర్బన్​ జిల్లా కాజీపేట, మడికొండ, ధర్మసాగర్​లో  మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. కాజీపేట రైల్వేస్టేషన్​ వద్ద ఆటో యూనియన్​ కార్మికులు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దాస్యం వినయ్​ భాస్కర్​ పాల్గొన్నారు.

By

Published : May 1, 2019, 4:28 PM IST

అన్నదానం

వరంగల్​ అర్బన్​ జిల్లా కాజీపేట, మడికొండ, ధర్మసాగర్​లోని ప్రధాన కూడళ్ల వద్ద కార్మికవర్గం జెండా ఎగరవేసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కాజీపేటలో ఆటో యూనియన్​ కార్మికులు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దాస్యం వినయ్​ భాస్కర్​ హాజరయ్యారు. ఆటోల్లో ప్రయాణికులు మర్చిపోయిన బంగారు ఆభరణాలను, నగదును, లాప్ టాప్ తదితర విలువైన వస్తువులను ప్రయాణికులకు నిజాయితీతో తిరిగి ఇచ్చిన ఆటో డ్రైవర్లను ఎమ్మెల్యే సన్మానించారు.

ఇవీ చూడండి: కాళేశ్వరంలో ఒక్క పంప్... 35వేల మోటార్లకు సమానం

కాజీపేటలో మేడే వేడుకలు.. కార్మికుల అన్నదానం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details