వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోనీ అమ్మ అనాధ వృద్ధాశ్రమంలో మృత్యువాత పడిన వృద్ధులకు సామూహికంగా పిండ ప్రదానం చేశారు ఆశ్రమ నిర్వాహకురాలు శ్రీదేవి. కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద శాస్త్రోక్తంగా పిండ ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. నిరాదరణకు గురైన వారిని అక్కున చేర్చుకుని... వారు కాలం చేసిన తర్వాత సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు శ్రీదేవి. అంతేకాకుండా వారి ఆత్మకు శాంతి చేకూరాలని పిండప్రదానం కూడా చేయిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆశ్రమంలోని కొందరు వృద్ధులు కూడా హాజరయ్యారు.
అనాధ వృద్ధులకు సామూహిక పిండ ప్రదానం - అంత్యక్రియలు
ఎవరూ లేని వారిని అక్కున చేర్చుకొని.. వారు చనిపోయిన తర్వాత సంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు నిర్వహిస్తూ... పిండప్రదానం కూడా చేస్తున్నారు వరంగల్ జిల్లాకు చెందిన అమ్మ అనాధ ఆశ్రమ నిర్వాహకురాలు.
![అనాధ వృద్ధులకు సామూహిక పిండ ప్రదానం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4536331-765-4536331-1569308557057.jpg)
అనాధ వృద్ధులకు సామూహిక పిండ ప్రదానం