వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బందికి ఇండస్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో పాటు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 300 మందికి వీటిని అందజేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యుల సేవలే కాకుండా కిందిస్థాయి సిబ్బంది సేవలు సైతం మరువలేనివని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఎంజీఎం ఆసుపత్రి సిబ్బందికి మాస్కుల పంపిణీ - వరంగల్ ఇండస్ స్వచ్ఛంద సంస్థ మాస్కుల పంపిణీ
కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వాలు చేస్తున్న కృషికి స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సహకారం అందిస్తున్నాయి. తాజాగా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సిబ్బందికి ఇండస్ స్వచ్చంద సంస్థ సభ్యులు మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు.

ఎంజీఎం ఆసుపత్రి సిబ్బందికి మాస్కుల పంపిణీ