తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్​ ఉమ్మడి జిల్లాలో రెండో రోజు ప్రశాంతంగా లాక్​డౌన్​ - lockdown goes on peacefully in warangal district

వరంగల్​ ఉమ్మడి జిల్లాలో పోలీసులు లాక్​డౌన్​ను పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. లాక్​డౌన్​ సడలించిన సమయాల్లో ప్రజలు బయటకు వచ్చి తమ పనులు ముగించుకుంటున్నారు.

lockdown in warangal district
వరంగల్​లో పటిష్ఠంగా లాక్​డౌన్​

By

Published : May 13, 2021, 4:01 PM IST

వరంగల్​ ఉమ్మడి జిల్లాలో రెండో రోజు లాక్​డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రభుత్వం వెసులుబాటు ఇవ్వడంతో.. దుకాణాల వద్ద రద్దీ నెలకొంది. కొనుగోలుదారులతో కూరగాయల మార్కెట్లు కిటకిటలాడాయి. పది గంటల నుంచి లాక్​డౌన్ మొదలు కావడంతో రహదారులపైన పోలీసులు తనిఖీలు చేపట్టారు. గుర్తింపు కార్డులు ఉన్నవారు, వ్యాక్సిన్​ వేసుకున్న వారిని అనుమతించారు. పలుచోట్ల నిబంధనలు అతిక్రమించి తిరుగుతున్న వారిపై కేసులు నమోదు చేశారు.

హన్మకొండ, కాజీపేట, వరంగల్ ప్రధాన రహదారులు.. జనసంచారం లేక నిర్మానుష్యంగా మారాయి. బస్సులు 10 తర్వాత డిపోలకే పరిమితమయ్యాయి. వరంగల్ గ్రామీణ జిల్లా, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోను లాక్​డౌన్ పటిష్ఠంగా అమలుచేసేందుకు.. పోలీసులు చర్యలు చేపట్టారు. అనవసరంగా తిరిగే వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించారు.

ఇదీ చదవండి:టీకా పంపిణీపై లాక్‌డౌన్‌ ప్రభావం...కేంద్రాలకు తగ్గిన జనం

ABOUT THE AUTHOR

...view details