తెలంగాణ

telangana

కన్నులపండువగా శివపార్వతుల కల్యాణోత్సవం

By

Published : Nov 25, 2019, 4:13 PM IST

వరంగల్​ అర్బన్ జిల్లా కేంద్రంలో సుప్రసిద్ధ వేయి స్తంభాల ఆలయంలో శివపార్వతుల కల్యాణం వైభవంగా నిర్వహించారు.

కన్నులపండువగా శివపార్వతుల కల్యాణోత్సవం

వరంగల్​ అర్బన్ జిల్లా హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయంలో శివ పార్వతుల కల్యాణం కన్నులపండువగా జరిగింది. కార్తీక మాసం ఆఖరి సోమవారాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కల్యాణంలో పాల్గొన్న భక్తులకు స్వామి వారి కల్యాణ తలంబ్రాలు, శేష వస్త్రాలను ఆలయ అర్చకులు అందజేశారు.

కన్నులపండువగా శివపార్వతుల కల్యాణోత్సవం

ABOUT THE AUTHOR

...view details