కేసీఆర్ నాయకత్వంలో రానున్న రోజుల్లో కేంద్రంలో తెలంగాణ కీలక శక్తిగా అవతరిస్తుందని తెరాస నేత కడియం శ్రీహరి అన్నారు. 17 పార్లమెంట్ స్థానాలను గెలుచుకొని కేంద్రంలో చక్రం తిప్పుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. వరంగల్లో తెరాస పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన కేసీఆర్ సంక్షేమ పథకాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కిందని ప్రశంసించారు.
'కేంద్రంలో చక్రం తిప్పుతాం' - తెరాస పార్లమెంటరీ సమావేశం
ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలే మరోసారి అధికారాన్ని తెచ్చిపెట్టాయని తెరాస నేత కడియం శ్రీహరి ఫునరుద్ఘాటించారు. వరంగల్ తెరాస పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన కేటీఆర్పై ప్రశంసల జల్లు కురిపించారు.
!['కేంద్రంలో చక్రం తిప్పుతాం'](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2627754-264-5a8c8618-83c0-4163-a7f4-8d1057cf0cc6.jpg)
తెరాస పార్లమెంటరీ సమావేశం