తెలంగాణ

telangana

By

Published : Aug 21, 2020, 7:23 PM IST

ETV Bharat / state

వరంగల్​లో వరదనీటి ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మేయర్

వరంగల్​ జిల్లాలో ఆగకుండా కురుస్తున్న వానల వల్ల చెరువులు, కుంటలు నిండి లోతట్టు ప్రాంతాల్లోకి పొంగి పొర్లతున్నాయి. ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లో మేయర్ గుండా ప్రకాష్​ పర్యటించి.. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.

Inland areas in warangal were inspected by mayor gunda prakash
వరంగల్​లో వరదనీటి ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మేయర్

గత కొద్ది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరంగల్​ నగరవ్యాప్తంగా చెరువులు, వాగులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లో నగర పాలక సంస్థ మేయర్ గుండా ప్రకాష్​ పర్యటించారు. వర్షాల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని మేయర్ హామీ ఇచ్చారు.

వరదనీటికి గోడ కూలిపోయిన ఇంటిని పరిశీలిస్తున్న మేయర్

భారీ వర్షాల కారణంగా వరంగల్​కు తీరని నష్టం వాటిల్లిందని గుండా ప్రకాష్​ పేర్కొన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనే ప్రజలందరూ సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన తెలిపారు. వరదలతో సర్వం కోల్పోయిన వారికి నగరపాలక సంస్థ బాసటగా నిలుస్తుందని మేయర్ హామీ ఇచ్చారు.

ముంపు ప్రాంతాల్లో సమస్యలను పర్యవేక్షిస్తున్న మేయర్

ఇదీ చూడండి'యోగీ హయాంలో యూపీ​లో భారీగా తగ్గిన నేరాలు'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details