తెలంగాణ

telangana

ETV Bharat / state

నిర్మానుష్యంగా మారిన కాజీపేట్ చౌరస్తా - వరంగల్ అర్బన్ జిల్లా లాక్​డౌన్

వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్​లో.. ఉదయం 10 గంటల నుంచి లాక్​డౌన్​ కొనసాగుతోంది. ఉదయాన్నే ప్రజలు అధిక సంఖ్యలో బయటకు వచ్చి నిత్యావసరాలను కొనుగోలు చేసి తిరిగి వెళ్లిపోయారు. ఏసీపీ రవీంద్ర కుమార్ పట్టణంలో లాక్‌డౌన్‌ పరిస్థితిని పరిశీలించారు.

lockdown in kazipet
lockdown in kazipet

By

Published : May 12, 2021, 1:34 PM IST

లాక్​డౌన్ దృష్ట్యా.. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ చౌరస్తా నిర్మానుష్యంగా మారింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 10 గంటల తర్వాత వ్యాపారులు.. దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. ఏసీపీ రవీంద్ర కుమార్ పట్టణంలో లాక్‌డౌన్‌ పరిస్థితిని పరిశీలించారు. సిబ్బందికి తగు సూచనలు చేశారు.

పోలీసులు.. కట్టుదిట్టంగా నిబంధనలను అమలు చేస్తున్నారు. పది రోజుల పాటు ప్రజలు రోడ్డుపైకి రాకుండా అవగాహన కల్పిస్తున్నారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:లాక్​డౌన్ నిబంధనలకు అనుగుణంగా మద్యం దుకాణాలు

ABOUT THE AUTHOR

...view details