ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. నేటి నుంచి రెండో డోసు వారికి మాత్రమే టీకా ఇస్తుండగా వరంగల్, హన్మకొండ, కాజీపేటల్లోని అన్ని కేంద్రాల వద్ద ఇవాళ రద్దీ నెలకొంది. వ్యాక్సిన్ దొరకదనే సందేహంతో జనం తరలివస్తున్నారు.
రెండో డోసు కోసం వ్యాక్సిన్ కేంద్రాల వద్ద జనం బారులు - తెలంగాణ వార్తలు
నేటి నుంచి రాష్ట్రంలోని అన్ని టీకా కేంద్రాల్లో కేవలం రెండో డోసు మాత్రమే ఇస్తున్నారు. మొదటి డోసు నిలిపివేశారు. కాగా వ్యాక్సిన్ దొరకదనే సందేహంతో టీకా కేంద్రాలకు జనం భారీగా తరలివస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని టీకా కేంద్రాల వద్ద రద్దీ నెలకొంది.

వరంగల్లో టీకా కేంద్రాల వద్ద రద్దీ, వరంగల్లో వ్యాక్సినేషన్
వరంగల్ అర్బన్ జిల్లాలో కొవాగ్జిన్ కేంద్రాలు కేవలం నాలుగు మాత్రమే ఉండగా... మిగతా చోట్ల కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. రెండో డోసు వేసే క్రమంలో ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన సమాచారం ఇవ్వడం లేదని వాపోయారు.