తెలంగాణ

telangana

By

Published : Nov 29, 2019, 5:00 PM IST

ETV Bharat / state

'సీసీ కెమెరాలతో నేరాలు నియంత్రించవచ్చు'

వరంగల్​ మహానగర పాలక సంస్థ సర్వ సభ్య సమావేశం జరిగింది. ఓరుగల్లు మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నేరాలు నియంత్రించాలని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్​ ప్రతిపాదించారు.

'సీసీ కెమెరాలతో నేరాలు నియంత్రించవచ్చు'
'సీసీ కెమెరాలతో నేరాలు నియంత్రించవచ్చు'


అభివృద్ధి అజెండాగా వరంగల్ మహానగర పాలక సంస్థ సర్వ సభ్య సమావేశం జరిగింది. బల్దియా కౌన్సిల్ హాల్​లో జరిగిన ఈ సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్​తో పాటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్, కార్పొరేటర్లు హాజరయ్యారు.

స్మార్ట్ సిటీ నిధులతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నేరాలను నియంత్రించాలని ఎమ్మెల్సీ తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఓరుగల్లులో గత కొన్ని నెలల వ్యవధిలో ముగ్గురు యువతులపై అత్యాచారం చేసి హత్యచేసిన ఘటనలు వెలుగుచూశాయని సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు తగ్గుముఖం పడతాయని ఎమ్మెల్సీ తెలిపారు.

కౌన్సిల్ ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదం తెలుపగా వరంగల్ పశ్చిమ శాసనసభ్యుడు దీక్ష దివస్ ప్రాముఖ్యతను అందరికీ తెలిసేలా పైలాన్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు సమర్ధించారు. త్వరలో కార్పొరేషన్ అధికారులు స్థల సేకరణ చేసి నిర్మాణం జరుపుకోవాలని కోరారు.

'సీసీ కెమెరాలతో నేరాలు నియంత్రించవచ్చు'

ఇదీ చూడండి: ఆర్టీసీపై ప్రభుత్వ కీలక నిర్ణయం... రోడ్లెక్కిన ప్రగతి రథ చక్రాలు

ABOUT THE AUTHOR

...view details