తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Jan 18, 2024, 12:30 PM IST

ETV Bharat / state

'అదే మా బతుకుదెరువు - ప్రాణాలైనా వదులుకుంటాం కానీ భూములు మాత్రం ఇవ్వం'

Greenfield Highway Project Issue : పచ్చని పంటలు పండే తమ పంట పొలాలను అభివృద్ధి పేరుతో లాక్కునే ప్రయత్నం జరుగుతుందని, దేశానికి అన్నం పెట్టే రైతన్న భూములను లాక్కుంటే ఆదుకునే నాధుడు లేడంటూ భూములు కోల్పోతున్న భూనిర్వాసిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో ప్రాణంగా చూసుకునే తమ భూములను లాక్కుంటే ప్రాణాలైనా వదులుకుంటాం కానీ తమ భూములను ఇచ్చేది లేదంటూ తేల్చి చెప్తున్నారు.

Landless Farmers Losing Land On Greenfield National Highway
Landless Farmers Losing Land

గ్రీన్ ఫీల్డ్ నేషనల్‌ హైవేకి ఇవ్వమంటూ రైతుల ధర్నా - పురుగుల మందు డబ్బాలతో నిరసన

Greenfield Highway Project Issue : విజయవాడ నుంచి నాగపూర్ వరకు గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేలో(Greenfield National Highway) భూములు కోల్పోతున్న భూ నిర్వాసిత రైతులు గత కొద్ది సంవత్సరాలుగా తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. హనుమకొండ జిల్లా పరకాల రెవిన్యూ డివిజన్లో భూములు కోల్పోతున్న పలు గ్రామాలకు చెందిన రైతులు పరకాల ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ప్రక్రియ ప్రారంభం నుంచి రైతులు రహదారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అయిన తమ గోడును పట్టించుకోకుండా నేషనల్ హైవే అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

"ప్రతిరోజు పొలంలో అనేక కష్టాలు పడుతుంటాం. ఆకలి దప్పికలు లెక్కచేయకుండా భూమిని నమ్ముకొని జీవిస్తూ ఉన్న మా భూములను హైవే పేరిట అన్యక్రాంతం చేస్తున్నారు. రైతే రాజు అంటున్న ప్రభుత్వాలు ఇలా పేదల భూములను లాక్కుంటూ మాకు కన్నీరే మిగులుస్తున్నాయి. నేషనల్​ హైవే కోసం 8 వేల ఎకరాలు లాక్కున్నారు.​ విజయవాడ నుంచి నాగపూర్​ వరకు నేషనల్​ హైవే కొత్త మార్గం నిర్మించరాదని పోరాటం చేస్తున్నాం. పంటలు పండించే భూముల్లో భవనాలు, రోడ్లు నిర్మిస్తూ పోతే పంటలు ఎలా పండించాలి."- భూ నిర్వాసితుడు

Green Field National Highway: 'గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేకు భూములను ఇచ్చేదేలేదు'

Hanamkonda Farmers Protest Greenfield Project : పలుమార్లు స్థానిక ప్రజా ప్రతినిధులతోపాటు దిల్లీలోని పెద్దలకు కలిసి తమ గోడు విన్నవించుకున్న ఫలితం లేదని రైతులు వాపోతున్నారు. న్యాయబద్ధంగా పోరాడేందుకు కోర్టులో కేసు వేశామని అయినప్పటికీ హైవే అధికారులు అవేమి పట్టనట్టు భూమికి పరిహారం ఇస్తామంటూ చెపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక చేసేది ఏమిలేక పురుగుల మందు డబ్బాలతో ఆర్డీవో కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు.

"మా భూములను గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేకు ఇవ్వబోం. ఈ ఉద్యమం ఇలానే కొనసాగుతుంది. అధికారులు కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్నారు. ఎన్జీటి హైకోర్టులో మా కేసు ఉండగా దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా మమల్ని చిన్న చూపు చూస్తున్నారు. కాదని ముందుకెళ్తే ఉద్యమాన్ని కొనసాగిస్తాం, ప్రాణ త్యాగానికి సైతం సిద్ధం. గ్రీన్​ ఫీల్డ్​ను బ్రౌన్​ ఫీల్డ్​గా మార్చాలని కోరుతున్నాం. 5 సంవత్సరాల నుంచి అధికారులకు విన్నవిస్తున్నాం. కనీసం ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి అయినా ఈ సమస్యపై స్పందించాలి."- భూ నిర్వాసితుడు

20 కి.మీ.ల మేర 100 గుంతలు.. సర్కార్​పై విమర్శలు.. ఇదీ అక్కడి హైవే దుస్థితి!

కొంతమంది రైతులు తమ ఆడబిడ్డల పెళ్లిళ్ల సమయంలో భూములను భరణంగా ఇచ్చామని ఇప్పుడు ఆ భూములు కోల్పోతుండటంతో కుటుంబాల్లో కలహాలు మొదలవుతున్నాయని కన్నీరు పెట్టుకుంటున్నారు. మనోవేదనతో కొంతమంది రైతులు ఇప్పటికే ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఇప్పటికైనా గ్రీన్ ఫీల్డ్ హైవేను బ్రౌన్ ఫీల్డ్‌గా మార్చి తమ భూములతో పాటు, రైతుల ప్రాణాలను కాపాడాలని వేడుకుంటున్నారు.

తోటచర్ల నేషనల్ హైవేపై ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్ల దాడి

Kishan Reddy on National Highways: రాష్ట్ర రహదారులకు రూ.91,511 కోట్లు

ABOUT THE AUTHOR

...view details