తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉగాది కానుకగా 2.5 లక్షల ఇళ్లకు స్వచ్ఛమైన తాగునీరు

ఉగాది పండుగ కానుకగా వరంగల్ వాసులకు స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తామని వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ గుండా ప్రకాష్ అన్నారు. తాగునీటి సరఫరా అంశంపై మంత్రి కేటీఆర్​ గతంలోనే సమీక్ష నిర్వహించారని తెలిపారు.

By

Published : Jan 8, 2021, 1:13 PM IST

greater warangal municipal corporation mayer told clean drinking water for 2.5 lakh households as a gift from ugadi festivel
ఉగాది కానుకగా 2.5 లక్షల ఇళ్లకు స్వచ్ఛమైన తాగునీరు

ఉగాది కానుకగా తమ పరిధిలోని సుమారు 2.5 లక్షల పైచిలుకు ఇళ్లకు స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తామని వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ గుండా ప్రకాష్ తెలిపారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు తాగునీటి సరఫరాకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లను చేస్తున్నామని స్పష్టం చేశారు.

వరంగల్​ వాసులకు తాగునీటిని అందించేందుకు బల్దియా ఇంజనీరింగ్, ప్రజా ఆరోగ్య విభాగాల సిబ్బంది తీవ్రంగా కష్టపడుతున్నారని మేయర్​ ప్రకాశ్​ అన్నారు. ఈ అంశంపై మంత్రి కేటీఆర్​ గతంలోనే సమీక్ష నిర్వహించారని తెలిపారు.

ఇదీ చదవండి:'గో సడక్‌ బంద్' నేపథ్యంలో ముందస్తు అరెస్టులు

ABOUT THE AUTHOR

...view details