తెలంగాణ

telangana

By

Published : Nov 26, 2019, 3:45 PM IST

ETV Bharat / state

అంబేడ్కర్​కు నివాళులర్పించిన ఎమ్మెల్యే వినయ్ భాస్కర్

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో అంబేడ్కర్ విగ్రహానికి ప్రభుత్వ చీఫ్​ విప్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

GOVT CHIEF WHIP at ambedkar statue
అంబేడ్కర్​కు నివాళులర్పించిన ఎమ్మెల్యే వినయ్ భాస్కర్

భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని... దాన్ని పాటించాలని ప్రభుత్వ చీఫ్​ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్​ భాస్కర్ తెలిపారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్​ అర్బన్ జిల్లా హన్మకొండ అంబేడ్కర్​ కూడలిలో అంబేడ్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎందరో మహానుభావుల ప్రాణత్యాగం చేసి దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చారని.. అలాంటి దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడంలో అంబేడ్కర్ ఎనలేని కృషి చేశారన్నారు.

అంబేడ్కర్​కు నివాళులర్పించిన ఎమ్మెల్యే వినయ్ భాస్కర్

ABOUT THE AUTHOR

...view details