తెలంగాణ

telangana

'రాష్ట్ర అభివృద్ధితో పాటు.. పేదల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ'

By

Published : Jan 19, 2021, 4:34 PM IST

నిరుపేదలకు తెరాస ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ పేర్కొన్నారు. హన్మకొండలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్​లను అందజేశారు.

Government West Whip, Warangal West MLA Vinayabhaskar said that the Teresa government has always stood firm
'రాష్ట్ర అభివృద్ధితో పాటు .. పేదల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ'

సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధితో పాటు పేదల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ తెలిపారు. హన్మకొండలో అనారోగ్యంతో బాధపడుతున్న 14 మందికి .. రూ.10 లక్షల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్​లను అందజేశారు.

ఆదుకుంటాం..

పట్టణ ప్రజా సంక్షేమ యాత్ర ద్వారా పట్టణంలోని పలు కాలనీలలో కలియతిరిగిన ఎమ్మెల్యే.. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే వారిని తప్పకుండా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:రికార్డు లాభాల్లో మార్కెట్లు- 14,500 పైకి నిఫ్టీ

ABOUT THE AUTHOR

...view details