నిత్యావసరాలను పంపిణీ చేసిన ప్రభుత్వ చీఫ్ విప్
లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని వారికి ప్రభుత్వ చీఫ్ విప్ వినయభాస్కర్ అండగా నిలిచారు. అర్ధకాలితో అలమటిస్తున్నవారికి నిత్యావసర సరకులను పంపిణీ చేశారు
warngal urban district latest news
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయభాస్కర్ నిరుపేదలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు తన నియోజకవర్గంలో ఉన్న నిరుపేదలకు నిత్యావసరాలను అందజేసినట్లు ఆయన తెలిపారు. కరోనా వైరస్ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్డౌన్ను ప్రజలు ఇంకా కొన్ని రోజులు పాటించి... కరోనా మహమ్మారి నివారణకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.