తెలంగాణ

telangana

ETV Bharat / state

TRS Vijaya Garjana Sabha: విజయగర్జన సభకు అడ్డంకులు.. భూములిచ్చేది లేదన్న రైతులు

హనుమకొండ జిల్లాలో ఈ నెల 29న తెరాస నిర్వహించ తలపెట్టిన విజయగర్జన(TRS Vijaya Garjana Sabha) సభకు అవాంతరాలు ఏర్పడ్డాయి. సభ నిర్వహించేందుకు స్థలం కోసం స్థానిక నాయకులు అన్వేషిస్తుండగా.. రైతులు మాత్రం తమ పొలాలను ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. సభ ఏర్పాట్లను అడ్డుకుంటూ ధర్నా నిర్వహించారు.

By

Published : Nov 5, 2021, 6:07 PM IST

warangal vijaya garjana sabha
తెరాస విజయ గర్జన సభ గొడవ

హనుమకొండ జిల్లా దేవన్నపేటలో అన్నదాతలు మరోసారి(TRS Vijaya Garjana Sabha) ఆందోళనకు దిగారు. ఈనెల 29న తెరాస నిర్వహించే విజయగర్జన సభకు ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. ఈ క్రమంలో సభాస్థలి నిర్వహణ స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన అధికారులతో గొడవకు దిగారు. పంటలు పండే భూములను ఇవ్వబోమని.. అధికారులు అక్కడ నుంచి వెళ్లిపోవాలని ధర్నాకు(TRS Vijaya Garjana Sabha) దిగడంతో వారు వెనుతిరిగారు.

గత రెండు మూడురోజులుగా వరంగల్​ విజయగర్జన(TRS Vijaya Garjana Sabha) సభ కోసం ప్రభుత్వ చీఫ్​ విప్​ వినయ్​ భాస్కర్, వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్​, మాజీ మంత్రి కడియం శ్రీహరి సహా పలువురు నేతలు మూమునూర్, రాంపూర్, దేవన్నపేటలోని ఖాళీ ప్రదేశాలు పరిశీలించారు. ఇటీవలే వారు దేవన్నపేటకు వెళ్లగా తెరాస నేతల(TRS Vijaya Garjana Sabha) తో రైతులు వాగ్వావాదానికి దిగారు. పంట పండే భూములను ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఈరోజు కూడా నాయకులు రాగా.. వారితో మళ్లీ వాగ్వాదానికి దిగారు.

పంట పండే పొలాలను సభ కోసం ఇస్తే తర్వాత మేము ఇబ్బందులు పడాల్సివస్తుంది. వచ్చే నష్టాన్ని ఎవరు పూరిస్తారు.? భూములు ఇచ్చేది లేదని మేము తెగేసి చెప్పాం. ఇవ్వకపోతే మా పేరు మీద ఉన్న భూములను ధరణి పోర్టల్​ ద్వారా ఇతరుల పేరు మీదకు మార్పిస్తామని బెదిరిస్తున్నారు. -స్థానిక రైతులు

దీంతో ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక నాయకులు(TRS Vijaya Garjana Sabha) తలలు పట్టుకుంటున్నారు. సభ ఎక్కడ నిర్వహించాలనే దానిపై గందరగోళం నెలకొంది. సుమారు 15లక్షల మందితో సభ జరగనుంది. 40 వేల వాహనాలకు పార్కింగ్ ఉండేలా స్థలాన్ని చూస్తున్నారు.

పంటలు పండే భూములను సభకు ఇవ్వబోమని రైతుల ధర్నా

ఇదీ చదవండి:Old couple Tragic story: రెక్కలు ఆడని దంపతుల కథ.. రెప్పల మాటున కన్నీటి గాథ.!

ABOUT THE AUTHOR

...view details