తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్​ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఉద్యోగులు

హన్మకొండలో సీఎం కేసీఆర్​ చిత్రపటానికి విద్యుత్​ ఉద్యోగులు క్షీరాభిషేకం చేశారు. తమ సమస్యలు పరిష్కరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

By

Published : Oct 22, 2019, 7:42 PM IST

కేసీఆర్​ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఉద్యోగులు

కేసీఆర్​ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఉద్యోగులు
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి విద్యుత్ ఉద్యోగులు పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలో పని చేస్తున్న ఆర్టిజన్ కార్మికుల సర్వీసులకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆర్టిజన్ కార్మికుల సర్వీస్ నిబంధనలకు సంబంధించి తమ సంఘం విద్యుత్ యజమానులతో చర్చలు జరపడం వల్లే విధివిధానాలు ఖరారు అయ్యాయని ఆయన అన్నారు. రెగ్యులర్ విద్యుత్ కార్మికుల తరహాలో ఆర్టిజన్ కార్మికుల హక్కులను సాధించుకుంటామని జాన్సన్​ ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details